సిద్దిపేట : సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల దవాఖానలో బ్లాక్ ఫంగస్ సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. సిద్దిపేట పట్టణానికి చెందిన మోహినోద్దిన్(75) కరోనాతో చికిత్స పొందుతూ బ్లాక్ ఫంగస్కు గురయ్యాడురు. దీంతో సిద్దిపేట మెడికల్ కళాశాల ఈఎన్టీ ప్రొఫెసర్ నాగరాజు, ఈఎన్టీ వైద్యులు అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ తమిళ అరస్, సూపరింటెండెంట్ జయశ్రీ, అనస్థీషియా డాక్టర్ చందర్ ఆధ్వర్యంలో సోమవారం విజయవంతంగా బ్లాక్ ఫంగస్ ఆపరేషన్ నిర్వహించి బ్లాక్ ఫంగస్ను తొలగించారు.
సిద్దిపేట దవాఖానలో నాలుగు కేసులుండగా, మొదటి ఆపరేషన్ను నిర్వహించారు. ప్రస్తుతానికి రోగి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో మైక్రో డిబ్రాయిడరీ ఎండోస్కోపి సహాయంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన