10 గ్రామాల్లో 20 వేల మాస్కుల పంపిణీకి ఉషా లక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ నిర్ణయం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వైరస్వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు రొమ్ము క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ హైదరాబాద్ పింక్ రిబ్బన్ మాస్క్ క్యాంపెయిన్ను చేపట్టింది. ‘బంగారు తెలంగాణలో కొవిడ్-19 పింక్రిబ్బన్ మాస్క్’ పేరిట చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని 10 గ్రామాల్లో రెండు రోజుల్లో 20వేల మాస్కులను పం పిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్థిక మంత్రి హరీశ్రావు బుధవారం ఇంబ్రహీంపూర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపూర్ను దత్తత తీసుకొని ఆరేండ్లుగా గ్రామ అభివృద్ధికి కృషిచేస్తున్న డాక్టర్ పీ రఘురామ్ను అభినందించారు. పింక్ రిబ్బన్ మాస్క్ కార్యక్రమం ద్వారా పంపిణీ చేయనున్న మాస్కులను మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్హెచ్జీ)తో తయారు చేయించడం హర్షణీయమన్నారు. డాక్టర్ రఘురామ్ మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలోని 90 గ్రామాల్లో మాస్కులను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి సాయమందించదల్చుకున్న దాతలు 9100903781 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు.