వనపర్తి : టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శ్రీరంగాపురం మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త చటమోని బుచ్చన్న కరెంట్ షాక్ తో మరణించాడు. పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా ఇన్సూరెన్స్ కింద వచ్చిన రూ.2 లక్షల చెక్కును బుచ్చన్న సతీమణి పద్మమ్మకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..టీఆర్ఎస్లోనే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం లభిస్తుందన్నారు. నిస్వార్థంగా పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు.