హరారే: జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ భారీ ఆధిక్యం దక్కించు కుంది. బంగ్లా తొలి ఇన్నింగ్స్లో 468 పరుగులు చేయగా.. మెహదీ (5/82), షకీబ్ (4/82) ధాటికి జింబాబ్వే 276 పరుగులకే ఆలౌటైంది. కైటానో (87), టేలర్ (81) రాణించారు. అనంతరం శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది.