బోడుప్పల్, మే 20 : బోడుప్పల్ ప్రజాప్రతినిధులతో కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి స్థానిక మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి గురువారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహంచారు. సంస్థాగతంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న జాగ్రత్తలను అడిగి తెలుసుకున్నారు. ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటయిన సందర్భంగా ప్రజలు వినియోగించుకునేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నారు. కరోనా వైరస్సోకి ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి సూరారం మల్లారెడ్డి దవాఖానతో సమన్వయం చేసుకుని రోగనివారణకు కృషిచేయాలని కోరారు. డాక్టర్ చామకూర బద్రారెడ్డి, బోడుప్పల్ కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.