ఎంపీ ధర్మపురి అర్వింద్ బెదిరింపు
నందిపేట్ పోలీసులపై దాదాగిరి
నందిపేట్, సెప్టెంబర్ 3: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పోలీసులపై దౌర్జన్యానికి దిగారు. 200 మందిని వెంటేసుకుని ఠాణా వద్ద బైఠాయించి దాదాగిరి చేశారు. తన కార్యకర్తల జోలికి వస్తే ఠాణాను కూలగొడుతానంటూ హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా నందిపేట ఎస్సైని అర్వింద్ బెదిరిస్తున్న వీడియో.. సోషల్ మీడియాలో వైరల్గా మా రింది. బాధ్యతగల ప్రజాప్రతినిధిగాకాకుం డా రౌడీలా ఎంపీ వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీ డియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతు న్న నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన యువకుడిని నాలుగైదు రోజుల క్రి తం పోలీసులు మందలించారు. మరోమా రు అలాంటివి పెట్టవద్దని, కేసుల పాలైతే భవిష్యత్తు అంధకారమవుతుందని నచ్చజెప్పారు. బీజేపీ కార్యకర్త అయిన సదరు యువకుడు విషయాన్ని ఎంపీ అర్వింద్కు చేరవేయగా.. శుక్రవారం ఆయన 200 మందితో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లారు. స్టేషన్ ఆవరణలోనే కుర్చీలో కూర్చుని పోలీసులను దబాయించారు. ‘ఇప్పుడు 200 మందే వచ్చిండ్రు.. రేపు నేను 10 వేలమందిని తీసుకొస్త.. ఫైరింగ్ జేస్తరా..? మీరుజేసే పనులకు పోలీస్స్టేషన్ను కూలగొడ్తరు’ అంటూ అర్వింద్ హెచ్చరించారు. తమ కార్యకర్తల జోలికి రావొద్దంటూ అల్టీమేటం జారీచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎస్సై శోభన్బాబును పోలీస్స్టేషన్ ఆవరణలో నిలబెట్టి అందరిముందు అవమానపరిచేలా మాట్లాడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.