హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పచ్చి అబద్ధాలు చెప్పడంలో బీజేపీ నేతలు ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. గ్యాస్ సిలిండర్పై రాష్ట్ర ప్రభుత్వం రూ.291 వసూలు చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సోమవారంనాడు ఆయన మీడియా ఎదుట సాగించిన దుష్ప్రచారం బీజేపీ నైజాన్ని బయటపెడుతున్నది. గ్యాస్ సిలిండర్ ధర జీఎస్టీ పరిధిలో ఉన్నదనే కనీస స్పృహ కూడా లేకుండా ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం ఆయనకే చెల్లింది.
గ్యాస్ సిలిండర్పై కేంద్రం 5 శాతం పన్ను విధిస్తుండగా, రాష్ర్టాలు 55 శాతం పన్ను చొప్పున రూ.291 వసూలుచేస్తున్నాయంటూ ఇటీవల ఒక ఫేక్మెసేజ్ వైరల్ అయ్యింది. ఇది నిజమా? కాదా? అని పరిశీలించకుండానే ఎమ్మెల్యే రఘునందన్రావు అబద్ధాలు మాట్లాడి అజ్ఞానం చాటుకున్నారు. ఈ మేసేజ్ అబద్ధమని పలు మీడియా సంస్థలు, వెబ్సైట్లు ఆధారాలతో సహా నిరూపించాయి.