జమ్మికుంటలో ఇంటింటికీ వాచీల పంపిణీ
అడ్డుకున్న స్థానికులు.. తప్పించుకున్న యువకుడు
జమ్మికుంట, జూలై 18: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముం దే బీజేపీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. ఈటల బొమ్మతోపాటు, పువ్వు గుర్తుతో ఉన్న గోడ గడియారాలను పార్టీ నాయకులు ఇంటింటికీ పంచుతున్నారు. శనివారం హు జూరాబాద్లో ఓ యువకుడు ఈటల జమునను నిలదీసి, గడియారాన్ని నేలకు బాదిన ఘటన మరువకముందే.. ఆదివారం జమ్మికుంటలో వాచీల పంపిణీని స్థానికులు అడ్డుకున్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి, హౌసింగ్బోర్డు, కూరగాయల మార్కెట్ ఏరియా ప్రాంతాల్లో ఆదివారం బీజేపీ నాయకులు తమ కార్యకర్తలతో గోడ గడియారాల పంపిణీ చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి వాచీలను అందించారు. కొత్తపల్లిలో గడియారాలు పంపిణీ చేస్తు న్న ఆడెపు దేవరాజు అనే యువకుడిని స్థానికులు అడ్డుకున్నారు. వాచీలు ఎందుకు పంపిణీ చేస్తున్నావని అడిగారు. గడియారాల పంపిణీ ఆత్మగౌరవమా అంటూ నిలదీశారు. పోలీస్స్టేషన్కు తరలించే క్రమంలో ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. కొన్ని ఏరియాల్లో వాచీలు తీసుకునేందుకు నిరాకరించిన యజమానుల ఇండ్లు, షాపుల ముందు పెట్టి వెళ్లిపోతున్నా రు. ప్రతి వాడకూ కొందరు యువకులతో బృందాలను ఏర్పాటు చేసి వాచీలను పంపిణీ చేస్తున్నారు. ‘ఈటల ఇంత దిగజారుడా..?’ అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.