ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్
గులాబీ కండువా కప్పుకొన్న పలువురు బీజేపీ నేతలు
ఇల్లందకుంట: రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని చూసి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేశ్ తెలిపారు. మంగళవారం ఆయనతో పాటు ఎంపీటీసీల ఫోరం మోటపోతుల ఐలయ్య, సిరిసేడు సర్పంచ్ ఎండీ రఫీక్, బుస ఆదిలక్ష్మి, రాచపల్లి ఖాన్, మర్రివానిపల్లి సర్పంచ్ కళల రాజిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసి ఇల్లందకుంట మండల ఇన్చార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ దళిత బంధు పథకం మంచి పథకమని అన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. దళిత బంధు పథకాన్ని హుజరాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించటం సంతోషకరమని, ఆ పథకాన్ని చూసే టీఆర్ఎస్లో చేరుతున్నామని ప్రకటించారు.