కమలాపూర్, మే 23: ‘టీఆర్ఎస్సే మా పార్టీ.. సీఎం కేసీఆరే మా నాయకుడు’ అని వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎంపీపీ తడక రాణి, జడ్పీటీసీ సభ్యులు లాండిగ కళ్యాణి, సింగిల్ విండో చైర్మన్ పేరాల సంపత్రావు, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ పుల్లూరి రాంచందర్రావుతోపాటు 21 గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, మాజీ జడ్పీటీసీ నవీన్కుమార్, మర్రిపెల్లిగూడెం టీఆర్ఎస్ కార్యకర్తలు ఆదివారం హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని కలిశారు. మాజీమంత్రి ఈటలతో తమకెలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. మండలంలోని అన్నిగ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు గులాబీ పార్టీలోనే కొనసాగుతామని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, రాష్ట్ర నాయకుడు నాగుర్ల వెంకన్న, పర్యవేక్షకుడు డాక్టర్ పేరాల రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.