మాయమాటలే తప్ప బీజేపీ చేసిందేమి లేదు : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గత ఆరేండ్లుగా ప్రజలకు మాయమాటలు చెప్పుడే తప్ప చేసిందేమి లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్దేవ్పల్లిలో మంత్రి ఈ సాయంత్రం రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిగా కోరంటి శ్రీలత, అత్తాపూర్ నుంచి మాధవి అమరేందర్, మైలార్దేవ్పల్లి నుంచి ప్రేమ్దాస్ గౌడ్ లను భారీ మెజార్టీతో గెలిపించి బల్దియాకు పంపాల్సిందిగా కోరారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో తాగునీరు, కరెంట్ సమస్యలను పరిష్కరించిందన్నారు. డిసెంబర్ నుంచి మంచినీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారన్నారు. శాశ్వతంగా మంచినీటి బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కారణంగానే పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చింది ఏం లేదన్నారు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అమ్మకు అన్నం పెట్టని వారు.. చిన్నమ్మకు బంగారం పెడతారంట. ఎన్నికల ప్రచారానికి కేంద్ర పెద్దలు రాష్ర్టానికి వస్తున్నరంట.. రాష్ర్టానికి వచ్చేటప్పుడు రూ.1350 కోట్లు వరద సాయం తీసుకురావాలన్నారు.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి