మాల మహానాడు
ఎర్రగడ్డ, ఏప్రిల్ 13: మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు కుట్ర పన్నుతున్న బీజేపీకి గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని మాల మహానాడు జాతీయఅధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ చెప్పారు. మంగళవారం మోతీనగర్లో ‘నీలి కవాతు’ బ్యానర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఆ పార్టీకి ఘోరపరాభవం తప్పదన్నారు. కేంద్రం ఎస్సీ రిజర్వేషన్లకు తూట్లు పొడవటమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నదని విమర్శించారు.