అహ్మదాబాద్: మొట్టమొదటి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్తో ఇండియా తలపడనున్నది. పాయింట్ల పట్టికలో కోహ్లీ సేన టాప్లో నిలిచింది. జూన్లో ఇంగ్లండ్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో కివీస్తో భారత్ పోటీపడనున్నది. ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఇండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న టీమిండియా.. 560 పాయింట్లతో టెస్ట్ చాంపియన్షిప్ టేబుల్లో టాప్లో నిలిచింది. మొత్తం ఆరు సిరీస్లు ఆడిన ఇండియా.. 12 మ్యాచ్లను గెలవగా.. నాలుగింట్లో ఓడింది. ఇక న్యూజిలాండ్ 420 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నది. 5 సిరీస్లు ఆడిన న్యూజిలాండ్ ఏడు టెస్టుల్లో గెలవగా.. 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
టీమ్ ర్యాంకుల్లో ఫస్ట్..
టెస్టు టీమ్ ర్యాంకులను కూడా ఐసీసీ ప్రకటించింది. కోహ్లీ సేన 122 పాయింట్లతో తొలి ర్యాంక్ సాధించింది. 118 పాయింట్లతో న్యూజిలాండ్ రెండవ ర్యాంక్లో నిలిచింది. మొతెరా స్టేడియంలో జరిగిన మూడవ టెస్టును కేవలం రెండు రోజుల్లోనే మనోళ్లు ముగించారు. ఇక నాలుగవ టెస్టు కూడా కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. దీంతో టెస్టుల్లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.