కరీంనగర్ : హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఓడిపోతామనే భయంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు గుండాయిజం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏకంగా దాడులకు పాల్పడుతూ.. భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
వీణవంక మండలం వల్లభాపూర్లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈటల రాజేందర్ పర్యటన సందర్భంగా తన విధుల్లో భాగంగా ఫోటో తీసిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ బాపిరెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తవా అంటూ ఏఎస్ఐపై దాడి చేసి ఆయన షర్ట్ను చింపేశారు. అంతటితో ఆగకుండా.. ఆయన బైక్ లో ఈటల అనుచరులు గాలి తీసి పైశాచిక ఆనందం పొందారు.