న్యూఢిల్లీ : ప్రపంచదేశాలు కరోనా వైరస్ వ్యాప్తిలో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. ఈ విపత్తులో దోపిడీ అవకాశాలను చైనా వెతుక్కుంటున్నది. సందట్లో సడేమియా అనే పదానికి సరిగ్గా అతుక్కునేలా దీపం ఉన్నప్పుడు చైనా తన ఇంటిని చక్కబెట్టుకుంటున్నది. కొవిడ్ సంబంధ, ఔషధాల ముడిసరుకులను అమాంతం పెంచేస్తున్నారు. కాదు, కూడదంటే ఔషధ ఒప్పందాలను రద్దు చేసుకుంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ను ఎదుర్కోవటానికి భారతదేశం ప్రపంచం నలుమూలల నుంచి వస్తువులను కొనుగోలు చేస్తున్నది. కాని పొరుగు దేశాల నుంచి సరఫరాదారులు ఇంతటి విపత్తులో కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. చైనీస్ సరఫరాదారులు కొవిడ్ కంటైనర్ వస్తువుల ధరలను అమాంతం పెంచేశారు. హాంకాంగ్లో ధరల పెంపుపై భారత కౌన్సిల్ జనరల్ ప్రియాంక చౌహాన్ చైనా అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్-19 తో జరుగుతున్న పోరాటంలో ముడిసరుకులు, ఇతర ఉత్పత్తుల ధరలను చైనా నియంత్రిస్తుందని భారత్ భావిస్తున్నట్లు చైనా వార్తాపత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్తో ప్రియాంక చౌహాన్ అన్నారు.
చైనా సరఫరాదారులు కొవిడ్కు సంబంధించిన వస్తువుల ధరలను పెంచారని మార్కెట్ వర్గాలు తెలిపాయి. సగటున 200 డాలర్ల ధర కలిగిన 10-లీటర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ధరను రూ.1000 కు పెంచేశారు. మారు మాట్లాడితే వీటి ధరను రూ.1200 కు పెంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొందరు చైనా సరఫరాదారులు గతంలో చేసుకున్న ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేశారు. మిగతా దేశాల సరఫరాదారులు 5 లీటర్ లేదా 8 లీటర్ కాన్సన్ట్రేటర్ ధరను 10 లీటర్ కాన్సన్ట్రేటర్లకు అందిస్తున్నారు. 2020 లో వెంటిలేటర్ల ధర 6000 డాలర్ల నుంచి 30 వేల డాలర్లకు పెరిగింది.
చైనా ఫార్మా సరఫరాదారులు రెమ్డెసివిర్, ఫావిపిరవిర్ వంటి ఔషధాల ముడి పదార్థాలను వేలం ద్వారా అందిస్తున్నారు. కాగా, రెడ్క్రాస్ సొసైటీ ఆఫ్ చైనా తన భారతీయ విభాగానికి విరాళంగా వీటిని అందిస్తున్నది. చైనాకు రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను భారత్కు పంపుతున్నట్లు తెలిపింది. సరఫరా సక్రమంగానే జరుగుతందని, ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయని చైనా అధికారులు చెప్తున్నారు.
మరో సమస్య ఏమిటంటే చైనా ప్రభుత్వం సరఫరా కారిడార్లను నిరోధించింది. ప్రభుత్వ విమానయాన సంస్థలు సిచువాన్ ఎయిర్లైన్స్ ను భారతదేశం నుంచి విమాన ప్రయాణాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా విదేశాంగ మంత్రికి విన్నవించారు. భారతదేశంలోని 10 నగరాల నుంచి సిచువాన్ ఎయిర్లైన్స్ ప్రయాణాన్ని చైనా ప్రభుత్వం నిషేధించింది.
దంతాలు బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే శుభ్రపరుచుకోవాలా..?
సంపాదనలో స్టార్ ఆటగాళ్లను వెనక్కినెట్టిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ స్టార్
1100 ఏండ్ల నాటి పద్యం.. 18 వేల కోట్లు ముంచింది..!
అమెరికా-రష్యా నుంచి వ్యాక్సిన్ల కొనుగోలుకు రాజస్థాన్ నిర్ణయం
టీకా తీసుకున్న డబ్ల్యూహెచ్ఓ బాస్
సిద్ధమైన 2-డీజీ ఔషధం.. మొదట ఇచ్చేది ఎక్కడో తెలుసా..?
జైపూర్లో వరుస పేలుళ్లు.. 71 మంది దుర్మరణం : చరిత్రలో ఈరోజు
పండ్ల రారాజు మామిడితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..