మీ-సేవా కేంద్రాల ద్వారా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ

హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీలో కొత్త విధానం అమల్లోకి వచ్చింది. జనన, మరణ దరఖాస్తుల స్వీకరణ, సర్టిఫికెట్ల జారీని జీహెచ్ఎంసీ సిటీజన్ సర్వీస్ సెంటర్లతో పాటు ఇకపై మీ-సేవా కేంద్రాల్లో కూడా సేవలు అందుబాటులో వచ్చాయి. పునర్ వ్యవస్థీకరించిన ఈ కొత్త విధానంలో సర్కిళ్లలోని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల(ఏఎంసీ)ను సబ్ రిజిస్ట్రార్లుగా గుర్తిస్తూ బాధ్యతలను కేటాయించింది. పుట్టిన, మరణించిన 30 రోజుల్లోపు చేసుకునే దరఖాస్తుల పరిశీలన, జారీచేసే అధికారాన్ని ఏఎంసీలకు అప్పగించారు. నెల తరువాత నుంచి ఏడాది వరకు సమయంలో వచ్చిన దరఖాస్తులను రిజిస్ట్రార్లుగా ఉండే ఏ.ఎం.హెచ్.ఓ లు పరిశీలించి జారీచేస్తారు.
ప్రస్తుతం వార్డు యూనిట్ గా ఉన్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ఇక సర్కిల్ యూనిట్ గా మారుతూ జనవరి 1వ తేదీ నుండి నూతన విధానం అమలులోకి వచ్చింది. గడిచిన డిసెంబర్ 20వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు 13,026 జనన, మరణ ధృవీకరణ పత్రాలు జారీచేయగా వీటిలో జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు మీ-సేవా కేంద్రాల ద్వారా 7,561 సర్టిఫికేట్లు జారీ అయ్యాయి.
తాజావార్తలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్లో హైదరాబాదీ అరెస్ట్
- మహేష్ బాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. సర్కారు వారి పాట అక్కడ షురూ..
- ఆరు రాష్ట్రాల్లో ఆదివారం కొనసాగిన వ్యాక్సినేషన్
- 3,081 కరోనా కేసులు.. 50 మరణాలు
- 'ఓటీటీ సంస్థలు స్వీయ నియంత్రణ నిబంధనలు రూపొందించుకోవాలి'
- సల్మాన్ ఖాన్ 'కృష్ణ జింకల' వేట కేసు మరో ట్విస్ట్
- చిరుత దాడిలో అడవి పంది మృతి
- '57 ఏళ్లు నిండిన వారందరికీ త్వరలోనే ఆసరా పెన్షన్లు'
- ట్రాక్టర్ బోల్తా..17 మందికి తీవ్ర గాయాలు, ఒకరు మృతి
- కారంపొడి తింటే బరువు తగ్గుతారా..!