చెన్నై: బీజేపీ నేత ఖుష్బూ సుందర్పై ఇవాళ చెన్నైలో కేసు నమోదు అయ్యింది. శుక్రవారం రోజున ఓ మసీదు ముందు ఆమె ప్రచారం నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఆమె ప్రచారం చేసినట్లు కేసులో తెలిపారు. కోడంబాకమ్ పోలీసులు ఆమెపై కేసు బుక్ చేశారు. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్కు చెందిన ఆఫీసర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖుష్బూపై కేసు నమోదు చేశారు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండా.. మసీదు ముందు కరపత్రాలను ఖుష్బూ పంచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఖుష్బూతో పాటు ఆమె మద్దతుదారులపై కోడంబాకం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఐపీసీ 143, 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.