జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని భూపాలపల్లి ఇంఛార్జి ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 225 కేసులు నమోదు చేశామన్నారు. 340 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అంతర్ రాష్ట్ర ప్రయాణం చేసిన వారిపై 43 కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించనందుకు 1602, భౌతిక దూరం పాటించనందుకు 131 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఇంటికి చేరుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎస్పీ హెచ్చరించారు.