కుమ్రంభీం అసీఫాబాద్ : జిల్లాలోని సిర్పూర్ టీ మండలకేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల ఆవరణలో రూ. 2 కోట్ల 5 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కేజీబీవీ కళాశాలకు సిర్పూర్ టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ ని ప్రభుత్వ సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మండలంలోని ప్రజలందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సిర్పూర్ టీ కేజీబీవీ పాఠశాలను కళాశాలగా అప్ గ్రేడ్ చేశామన్నారు. దీనితో మండలంలోని విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చునార్కర్ సువర్ణ, ఉప సర్పంచ్ తోట మహేశ్, ఎంపీటీసీ సుహైల్ అహ్మద్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మన శ్రీనివాస్, ఇఫ్ఫాత్, మొయిజ్, ఆశిక్, డీఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
మనోధైర్యమే అసలైన మందు : మంత్రి నిరంజన్ రెడ్డి