హైదరాబాద్ : ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంగళవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.
సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దసరా పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్కు సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేసుకోనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మొత్తం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రుందరూ హాజరౌతారని పేర్కొన్నారు.