మురుగునీటి శుద్ధిలో ఆధునిక టెక్నాలజీ వినియోగానికి అవార్డు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ)/మాదాపూర్: మురుగునీటి శుద్ధిలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి పర్యావరణాని కి చేస్తున్న సేవలకుగాను హైదరాబాద్కు చెందిన బ్లూడ్రాప్ ఎన్విరో సంస్థ ఎండీ గంగాధర్రెడ్డికి కేంద్రప్రభుత్వం భారత్శ్రీ అవార్డు ప్రకటించింది. ఫైటో రెమిడియేషన్, కన్స్ట్రక్టెడ్ వెట్ ల్యాండ్ టెక్నాలజీతో చెరువులు, కాలువల్లోని మురుగునీటిని శుద్ధిచేసి ఆ నీటిని తిరిగి మొక్కల పెంపకానికి ఈ సంస్థ వినియోగిస్తున్నది. గంగాధర్రెడ్డికి కేంద్రమంత్రి అర్జున్రామ్ మెగ్వాల్ ఈ నెల 25న ఢిల్లీలో భారత్శ్రీ అవార్డును ప్రదానం చేశారు. గంగాధర్రెడ్డితోపాటు దేశవ్యాప్తంగా 13 మందికి ఈ అవార్డులు అందజేశారు. అవార్డు లభించటం ఎంతో ఆనందాన్నిచ్చిందని గంగాధర్రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో తమ సేవలను తెలంగాణతోపాటు మరో ఆరు రాష్ర్టాలకు విస్తరిస్తామని చెప్పారు.