హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కొవాగ్జిన్ టీకాను కొనుగోలు చేసేందుకు 14 రాష్ర్టాలు భారత్ బయోటెక్ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. టీకా కంపెనీల నుంచి కావాల్సినన్ని డోసుల కొనుగోలుకు ఇటీవల కేంద్రం రాష్ర్టాలకు అనుమతించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్తో సంప్రదింపులు జరుపుతున్నాయి. భారత్ బయోటెక్ 14 రాష్ర్టాలతో ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ వంటి రాష్ర్టాలు ఉన్నాయి. తెలంగాణ సైతం ఈ జాబితాలో ఉన్నట్టు సమాచారం. అనేక రాష్ర్టాలు కొవాగ్జిన్ను వీలైనంత త్వరగా సరఫరా చేయాలని కోరాయని భారత్ బయోటెక్వర్గాలు తెలిపాయి.
దేశంలో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు సకాలంలో వ్యాక్సిన్లు అందాలంటే టీకాల ఉత్పత్తిలో విప్లవాత్మక మార్పులు రావాల్సి ఉన్నదని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా అభిప్రాయపడ్డారు. ‘యూరోపియన్ యూనియన్-ఇండియా’ రౌం డ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కంపెనీల మధ్య ఒప్పందాలు, సాంకేతికత బదలాయింపు, కీలక యంత్రాల సరఫరా జరిగినప్పుడే టీకాల ఉత్పత్తి పెరుగుతుందని చెప్పారు. అదేసమయంలో దేశంలోని టీకా ఉత్పత్తి కంపెనీలకు భారీస్థాయిలో ముడిసరును అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉన్నదన్నారు.