ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కునికసా గ్రామ పంచాయతీ పరిధిలోని కొలాంగూడకు చెందిన గర్భిణి కొడప రాజుబాయి మృతిపై కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆరా తీశారు. మంగళవారం ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రాతో కలిసి గ్రామంలో పర్యటించారు. రెండుకిలో మీటర్లు కాలినడకన కొలాంగూడ గ్రామానికి వెళ్లారు. కునికసా గ్రామ సమీపంలోని వాగు దాటారు.
గర్భిణి మృతి చెందిన ఘటనపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు.
గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.25 వేల చెక్కును అందజేశారు. రోడ్డు, వంతెన నిర్మాణానికి కృషి చేస్తామని ఆమె తెలిపారు. కలెక్టర్ వెంట ఆయాశాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Alcohol : మద్యం తాగొద్దన్న కూతురు.. ఇల్లు వదిలి వెళ్లిపోయిన తల్లి
Job news : ఇన్కాయిస్లో 82 పోస్టులు
ఎదురెదురుగా రెండు విమానాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
గడ్డం పెంచుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు కాదు..!
సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి