కేపీహెచ్బీ కాలనీ, జూలై 4 : రాష్ర్టాన్ని పచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్తులు కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్లోని డైమండ్ ఎస్టేట్లో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, ఉప కమిషనర్ కె.రవికుమార్తో కలిసి పాల్గొని మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కాలనీలు, బస్తీలు, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొక్కలు నాటి సంరక్షిం చాలన్నారు. భూమిపై మొక్కలు తగ్గిపోతే వాతావరణ సమతుల్యత దెబ్బతిని ప్రకృతి విలయాలు సంభవించే అవకాశముందని హెచ్చరించారు. బాధ్యతగా మొక్కలు నాటి హరితహారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతిని కొనసాగిస్తున్నట్లు డీసీ రవికుమార్ అన్నారు. ఆదివారం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వ్యర్థాల తరలింపు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రోడ్ల పక్కన చెత్తాచెదారం, ఖాళీ ప్రదేశాలలోని వ్యర్థాలను తొలగించే దిశగా పనులు చేపడుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో శానిటేషన్ సూపర్వైజర్ మురళీధర్రెడ్డి, ఎస్ఎఫ్ఏలు పాల్గొన్నారు.
బాలానగర్, జూలై 4 : ప్రతి ఇల్లు, పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఇంటి పరిసరాలపై దృష్టి సారించాలని ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ కోరారు. ఆదివారం ఫతేనగర్ డివిజన్ పరిధి శివశంకర్నగర్లో డీసీ రవికుమార్తో కలిసి పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిలువతో దోమలు వ్యాప్తి చెంద కుండాతీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ నగేశ్, మురళీధర్ రెడ్డి, బాలకృష్ణ, శ్రీను, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
మియాపూర్ , జూలై 4 : హైదర్నగర్ డివిజన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీలో ఆదివారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతను సాధించేందుకు ప్రజలంతా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. రహదారులు, వీధులలో పేరుకున్న చెత్త కుప్పల తొలగింపు, మట్టి దిబ్బల తొలగింపును చేపడుతున్నట్లు, సిబ్బంది మరింత పకడ్బందీగా పని చేసి పరిశుభ్ర కాలనీలను నెలకొల్పేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సిబ్బంది మహదేవ్, భారత్, మహమూద్, పాండు, గణేశ్, పార్టీ నేతలు దామోదర్రెడ్డి, రాజేందర్, కృష్ణ, కాలనీ అధ్యక్షుడు సుబ్బారావు, మనోహర్రెడ్డి, ఏంవీరావు, ఉమాపతి,శ్రీనివాసరాజు, పరమేశ్, రంగరాజు, శివాజీబాబు, ఏకాంబరం, రేణుక పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని సుమిత్రనగర్, చైతన్యనగర్, విశాల్ టవర్స్ అపార్ట్మెంట్లలో ఆదివారం నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ మాధవరం రోజాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. కాలనీలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ నాగేశ్వర్నాయక్, పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ శంషీగూడ ఇంద్ర హిల్స్ ప్రాంతాలలో నిర్వహించిన పట్టణ ప్రగతిలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ ,జీహెచ్ఎంసీ సిబ్బంది, నాయకుతో కలిసి పాల్గొన్నారు. కాలనీల్లో పేరుకున్న చెత్త చెదారాల తొలగింపును ఆయన పర్యవేక్షించారు. అనంతరం కార్పొరేటర్ దొడ్ల మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.