జనగామ, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యారోగ్యశాఖలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో సర్కారు దవాఖానలపై ప్రజలకు నమ్మకం పెరిగిందని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం జనగామ ప్రభుత్వ ప్రధాన దవాఖానలో డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ రాజయ్యతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానల్లో పైసా ఖర్చులేకుండా రక్త, మూత్ర పరీక్షలతోపాటు గుండె, కిడ్నీ, బ్రెస్ట్ క్యాన్సర్, షుగర్ తదితర 57 రకాల టెస్టులు నిర్వహించేలా డయాగ్నస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేశారని తెలిపారు.అనంతరం మంత్రి రక్త పరీక్ష చేయించుకొన్నారు.