18,525 మంది ఎస్సీలకు లబ్ధి
_1608661662.jpg)
- రూ.786.23 కోట్లతో ప్రత్యేక వార్షిక ప్రణాళిక
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఎస్సీ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా ప్రత్యేక వార్షిక ప్రణాళికను రూపొందించింది. 18,525 మందికి లబ్ధిచేకూరేలా రూ.786.23 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాలను అమలుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లాలవారీగా ఆయాకార్యక్రమాలు, పథకాల అమలుకు కేటాయించిన నిధులను విభాగాలవారీగా నిర్ణయించి 2021 మార్చిలోగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ మేరకు కేటాయించిన నిధులు.. పూర్తిస్థాయిలో వినియోగంపై ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రణాళికలు రూపొందించి ఆయా జిల్లాల అధికారులకు పుస్తకం రూపంలో అందించింది. ఎస్సీ అభివృద్ధి సహకార సంస్థ ద్వారా కేటాయించిన రూ.786.23 కోట్లలో ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్ సబ్సిడీ రూ.500 కోట్లు, బ్యాంకు రుణం రూ.279.02 కోట్లు, ఈఎంఎఫ్, ఇతర శాఖాపరమైన సబ్సిడీ రూ.7.21కోట్లు అందించనున్నారు.
తాజావార్తలు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్లో విద్యాబాలన్ సినిమా నట్ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం