సిద్దిపేట జోన్, మే 19 : జ్వర సర్వేలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. బుధవారం తమ ఇంటికి వచ్చిన వైద్యబృందంతో ఆరోగ్య పరీక్షలు చేయించుకు న్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ .. కరో నా కట్టడికి చేపట్టిన ఇంటింటి సర్వేతో వైరస్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక దశలో గుర్తించి, వారికి కావాల్సిన మందులు ఇంటి వద్దనే ఇస్తున్నారన్నారు. తద్వారా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుందన్నారు. ఇంటికి వచ్చే వైద్య బృందానికి ప్రజలందరూ సహకరించాలని సూచించారు. ఎంపీపీ మాణిక్యరెడ్డి కుటుంబీకులకు వైద్య సిబ్బంది వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో సోంరెడ్డి, సీహెచ్వో శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి రాజేందర్రెడ్డి, ఎంవో డాక్టర్ సరిత, సీహెచ్వో ప్రకాశ్, ఏఎన్ఎం, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులకు వైద్య పరీక్షలు
రాయపోల్, మే 19 : కరోనా కట్టడికి గ్రామాల్లో ఆరోగ్య సర్వే నిర్వహిస్తున్నట్లు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్, ఎంపీడీవో రాంరెడ్డి అన్నారు. కొత్తపల్లిలో ఎంపీపీ కల్లూరి అనితాశ్రీనివాస్తోపాటు ప్రజాప్రతినిధులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకా రం నడుచుకోవాలని సూచించారు. సర్వేలో ఎంపీవో శ్రీనివాస్, అశ వర్కర్లు ఉన్నారు.
గ్రామాల్లో కొనసాగుతున్న జ్వర సర్వే
సిద్దిపేట అర్బన్, మే 19 : జ్వర సర్వే గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతోంది. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరులో సర్పంచ్ పల్లె నరేశ్గౌడ్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య సలహాలు పాటించాలన్నా రు. సర్వే లో ఏఎన్ఎం శోభ, కార్యదర్శి రవి ఉన్నారు.
మనోధైర్యంతోనే కరోనా నియంత్రణ
దౌల్తాబాద్, మే 19 : మనోధైర్యంతోనే కరోనా నియంత్రణ సాధ్యమని జడ్పీటీసీ రణం జ్యోతి అన్నారు. మండలంలోని గొడుగుపల్లిలో చేపట్టిన జ్వర సర్వేను జడ్పీటీసీతోపాటు సర్పం చ్ శివకుమార్ పరిశీలించారు. దౌల్తాబాద్లో ఎంపీడీవో మశ్చేందర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆది వెంకన్న, ఎంపీవో మిస్బా అలం, జిల్లా కో-అప్షన్ సభ్యుడు రహీమొద్దీన్, సూపర్వైజర్ శ్రీనివాస్ ఉన్నారు.
కరోనా నియంత్రణకు సహకరించాలి
బెజ్జంకి, మే 19 : కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జడ్పీటీసీ కనగండ్ల కవిత కోరారు. ఇంటింటి సర్వేలో భాగంగా దాచారంలో జడ్పీటీసీ ఇంట్లోని సభ్యులకు వైద్యపరీక్షలు చేసి, వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజాప్రతినిధులకు వైద్యసిబ్బంది పరీక్షలు చేశారు. సర్వేలో వైద్యాధికారులు లింగారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులున్నారు.
కరోనా వైరస్పై నిర్లక్ష్యం తగదు
తొగుట, మే 19 : కరోనా వైరస్పై నిర్లక్ష్యం తగదని తొగుట పీహెచ్సీ డాక్టర్ వెంకటేశ్ కోరారు. లింగాపూర్లో నిర్వహించిన సర్వేలో జడ్పీటీసీ గాంధారి ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు.
సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
హుస్నాబాద్టౌన్, మే 19: జ్వర సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ రజితావెంకన్న అన్నా రు. వైద్య సిబ్బంది మున్సిపల్ చైర్పర్సన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరీక్ష చేసి మందులను పంపిణీ చేశారు.