బేగంపేట ఎయిర్పోర్ట్ను ఏవియేషన్ యూనివర్సిటీగా మార్చాలని మంత్రి కేటీఆర్.. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కోరారు. అక్కడే యూరో స్పేస్ టెక్నాలజీ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అవి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపయోగపడుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమంలో కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించనున్నామని చెప్పారు. డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాలలో సీడ్బాల్స్ వెదజల్లి, తద్వా రా 50 లక్షల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. మెడిసిన్ ఫ్రం స్కై కార్యక్రమానికి వికారాబాద్ను ఎంచుకున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు యాదయ్య, మెతుకు ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్రెడ్డి, సురభివాణీదేవి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్లు సునీతామహేందర్రెడ్డి, అనితారెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, ఎమర్జింగ్ టెక్నాలజీ డైరెక్టర్ రమాదేవి లంక, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధి విఘ్నేశ్, హెల్త్నెట్ సీఈవో విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.