హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్లో కరోనా కలకలం సృష్టిస్తున్నది. కరోనా కేసులు పెరుగుతున్నప్పట్టికీ మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటున్నది. దీంతో బేగంబజార్లో 100కుపైగా కేసులు నమోదయ్యాయి. ఈనేపథ్యంలో మార్కెట్లోని దుకాణాల వేళల్లో మార్పులు చేస్తూ ది హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నది. రేపటి నుంచి ఉదయం 9 గంటలకు దుకాణాలు తెరుస్తామని, సాయంత్రం 5 గంటలకు షాపులను మూసివేస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రాఠి, ప్రధాన కార్యదర్శి మహేష్కుమార్ అగర్వాల్ తెలిపారు. బేగంబజార్, ఛత్రి, ఫిష్ మార్కెట్, మిట్టికా షేర్ తదితర ప్రాంతాల్లోని హోల్సేల్ కిరాణ దుకాణాలన్నీ తమ అసోసియేషన్ నిబంధనలను పాటిస్తాయని చెప్పారు. వ్యాపారులు, వినియోగదారులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.
గతంలో కూడా భారీగా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో బేగంబజార్లో దుకాణాలను వారం రోజులపాటు మూసివేశారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి గతేడాది జూన్ 28 నుంచి వారం రోజులపాటు మార్కెట్ను కిరానా మర్చంట్ అసోసియేషన్ స్వచ్ఛందంగా మూసివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..