బెంగళూరు: బెంగళూరుకు వచ్చే ఇతర రాష్ట్రాల ప్రజలు తప్పనిసరిగా ఆర్టీ- పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ వెంట తెచ్చుకోవాలని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో నిబంధనల అమలును ఆ రాష్ట్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది.
వచ్చేనెల ఒకటో తేదీ ఈ నిబంధనను అమలు చేస్తామని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ తెలిపారు. ఈ నిబంధన కేవలం బెంగళూరు మహా నగరానికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. మున్ముందు కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.
బెంగళూరు నగరంలో నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో 60శాతానికి పైగా అంతర్రాష్ట్ర ప్రయాణికులే ఉన్నారని మంత్రి సుధాకర్ అన్నారు. బుధవారం ఒక్కరోజే బెంగళూరు మహానగరంలో 1400 కొవిడ్ కేసులు రావడంతో గురువారం ఆయన అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, చండీగఢ్ల నుంచి వచ్చే ప్రయాణికులకు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
నగరంలోని పెద్ద పెద్ద భవన సముదాయాల్లోనే ఎక్కువ కేసులు వస్తున్నాయని మంత్రి సుధాకర్ తెలిపారు. గతంలో కేవలం తల్లిదండ్రులకే తప్ప పిల్లలకు పాజిటివ్గా వచ్చేది కాదన్నారు.
కానీ తాజాగా మొత్తం కుటుంబానికి పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నదని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్టాండ్లు, మార్కెట్లు, థియేటర్లు, కల్యాణ మండపాలు, కన్వెన్షన్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలల క్యాంపస్ల వద్ద భౌతికదూరం, మాస్క్లు ధరించడం వంటి నిబంధనలను అమలు చేయడానికి మార్షల్స్ను నియమిస్తామని తెలిపారు.
ఈ నెలలో జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..!
పీఎస్యూల ప్రైవేటీకరణతోనే వృద్ధి రేటు పరుగులు : రాకేష్ జంఝన్వాలా
ఐసీఐసీఐ సంచలనం
వచ్చే ఏడాది వరకూ ఇంతే.. కొవిడ్-19 ఎఫెక్ట్పై మెజారిటీ సీఈవోలు
చందా కొచర్కు రిలీఫ్.. ఆమె భర్త దీపక్కు బెయిల్