వరంగల్ అర్బన్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్న సీఎం కేసీఆర్కే మా మద్దతు అని హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లోని పూసల కులానికి చెందిన నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం హన్మకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఇల్లందకుంట మండల పూసల సంఘం అధ్యక్షుడు పసులేటి రమేష్, జమ్మికుంట మండల పూసల అధ్యక్షుడు ముదురుకోళ్ల రమేష్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను కలిశారు.
టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఇల్లందకుంట, జమ్మికుంట మండల కేంద్రాలలో పూసల కమ్యూనిటీ హాలును మంజూరు చేయమని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఇవి కూడా చదవండి..
రేపటి నుంచి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
అక్రమంగా పట్టా చేసుకున్నాడని.. పంట పొలంలోనే కట్టేశారు
ఇల్లందకుంటలో దళితుల భారీ ర్యాలీ