వనపర్తి : జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంత్రి జిల్లా అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా కేంద్రానికి సమీపంలో మంజూరయిన వంతెనలను వెంటనే చేపట్టి పూర్తిచేయాలి. అలాగే పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలసి సూచించారు. గ్రామాల్లో ప్రమాదకరంగా ఉన్న ఇండ్లను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంచినీటి సరఫరా మీద దృష్టిపెట్టాలని మంత్రి పేర్కొన్నారు. లీకేజీల మూలంగా నీటి కలుషితం జరగకుండా చూసుకొని లీకేజీలు అరికట్టాలన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం నిర్ధేశించుకుని గడువులోపు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 24న హరితహారంలో భాగంగా ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.
గ్రామాలలో బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలను గుర్తించి అవి తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిట్యాల రోడ్డు, జెర్రిపోతుల వాగు, రామా టాకీస్ వద్ద వంతెనలను వెంటనే చేపట్టాలి.
వర్షాకాలాన్ని కాంట్రాక్టర్లు సాకుగా చూపితే అధికారులు రాజీపడొద్దన్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరు బాగుంది. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి జీతాలు పెంచిందన్నారు.
వనపర్తి రోడ్ల విస్తరణ పట్ల అదనపు కలెక్టర్ ప్రత్యేకశ్రద్ద తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వారావు, జేసీ అంకిత్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు