కుమ్రం భీం ఆసిఫాబాద్ : కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చెక్పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. జిల్లాలోని జైనూర్ మండలం జంగాం సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టును ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎవ్వరిని అనుమతించవద్దని ఆదేశించారు. లాక్డౌన్ సందర్భంగా కట్టుదిట్టంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అలాగే హాజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాల తండ్రి ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు.