కుమ్రం భీం అసిఫాబాద్ : వచ్చే వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వైద్య, పంచాయతీ, బీసీ, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ మండలాలైన సిర్పూర్ యు, లింగాపూర్, జైనూర్, కెరమెరి, తిర్యాని ఇలాంటి వాటిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య పరచాలని సూచించారు.
అలాగే గతంలో డెంగ్యూ వ్యాధి కి గురైన బొంబాయిగూడా, పెంచికలపేట, దహెగాం గ్రామాలలో డెంగ్యూ వ్యాధి సోకకుండా చూడాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా లాంటివి ప్రజలకు సోకకుండా చూడాలని సూచించారు.
వైద్య అధికారులు గ్రామాల్లో ర్యాపిడ్ సర్వే చేసి ఎక్కడికక్కడ క్యాంపులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కొమురం బాలు, జిల్లాలోని ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
నలుగురు దోపిడీ దొంగలపై పీడీ యాక్ట్
ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి, 15 మందికి గాయాలు
వ్యాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి
మాడ్యుల్ ప్లైవుడ్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం