హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ‘బీడీఎల్- ఏ జర్నీ టువర్డ్స్ ఆత్మనిర్భరత’ శీర్షికన రాసిన ఈ-పుస్తకాన్ని డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీ రాజ్కుమార్ గురువారం ఢిల్లీ నుంచి ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించారు. బీడీఎల్ శక్తిసామర్థ్యాలు, సాధించిన విషయాలతో 75 పేజీల్లో ఈ పుస్తకాన్ని రూపొందించారు. కార్యక్రమంలో హైదరాబాద్ నుం చి బీడీఎల్ సీఎండీ కమాండర్ సిద్ధార్థ్ మిశ్రా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.