హాలియా, ఏప్రిల్ 10 : సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీలకతీతంగా బీసీలంతా ఏకమై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. సాగర్ నియోజకవర్గంలోని హాలియాలో శనివారం నిర్వహించిన బీసీ, ఎంబీసీ కులాల సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 40 బీసీ కులాల ప్రతినిధులు హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కు సంపూర్ణ మద్ద తు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణ య్య మాట్లాడుతూ.. భగత్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై ఉన్నదన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు అద్భుతమైన పథకాలని కితాబిచ్చారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులకు బాసటగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మా ర్చిన విషయాన్ని గుర్తుచేశారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. నోముల భగత్ గెలుపుతో రాష్ట్రంలో బీసీలకు మంచి రోజులు వస్తాయని, భవిష్యత్తులో బీసీలకు టికెట్ ఇస్తే గెలిపించుకుంటారనే సంకేతం వస్తుందని తెలిపారు. సాగర్లో జరుగుతున్నది ఆత్మగౌరవ పోరాటమని, భగత్ను గెలిపించి చరిత్ర సృష్టించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాజి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మి, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
హాలియా: ఆర్ కృష్ణయ్య శనివారం తిరుమలగిరి సాగర్ మండలంలోని కొంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున ప్రచారం చేశారు. సాగర్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి భగత్ను భారీ మెజార్టీతో గెలిపించి బీసీలు సత్తాచాటాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగా ణ): నోముల భగత్కు మద్దతుగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించా రు. పెద్దవూర, హాలియా, తిరుమలగిరి, త్రిపురారం, గుర్రంపోడు, నిడమనూరు మండలా ల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.
సాగర్ ఉప ఎన్నికల్లో నోము ల భగత్కు ఓటు వేస్తే.. నోముల నర్సింహయ్యకు నివాళి తెలిపిన స్ఫూర్తి ఓటర్లకు దక్కుతుందని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ అన్నారు.