ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11.4 టీఎంసీ ల నీటి నిల్వ సామర్థ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్ పూర్తైతే 2లక్షల 85 ఎకరాలకు సాగు నీరు అందనుండడం హర్షణీయమన్నారు. మండలానికి సాగు నీరును అందించేందుకు నిర్మించిన బునాదిగాని కాలువకు అనుసందానం కానున్న బస్వాపురం రిజర్వాయర్ నుంచి నిర్మించిన కాలువను ఈ సందర్భంగా పరిశీలించారు.
రానున్న కాలంలో ప్రభుత్వ సహకారంతో పాటు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి కృషితో మండలంలోని అన్ని గ్రామాల కు బునాదిగాని కాలువ ద్వారా అందుతాయన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు భాషబోయి న ఉప్పలయ్య, పంజాల వెంకటేశ్ గౌడ్, ఎంపీటీసీ యాస కవిత, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ కోరె భిక్షపతి, జిల్లా నాయకులు భానుప్రకాశ్, మండల నాయకులు రమేశ్గౌడ్, అరుణ, జయశ్రీ, పురుషోత్తంరెడ్డి, విద్యార్థి, యువజన విభాగం నాయకులు వెంకటేశ్వర్లు, నాగరాజు, పరుశురాములు, హైమద్, బీరప్ప, రాజు తదితరులు పాల్గొన్నారు.