హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న 12 సెంట్రల్ యూనివర్సిటీలకు నూతన వీసీల నియామకానికి రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ 12 వర్సిటీల వీసీల నియామకంతో మొత్తం 22 సెంట్రల్ వర్సిటీల్లో వైస్ ఛాన్సలర్స్ పోస్టులు భర్తీ అయ్యాయి. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఈ 12 యూనివర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నూతన వీసీలను నియమిస్తూ ఉత్వర్వులు వెలువడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా డా.బీజే రావు నియమితులయ్యారు.
ఆయా వర్సిటీలకు వీసీలుగా నియమితులైన వారి వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ – భట్టు సత్యనారాయణ (ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్. వర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో 31కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురితమయ్యాయి.)
హర్యానా సెంట్రల్ యూనివర్శిటీ – తంకేశ్వర్ కుమార్
హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్శిటీ – సత్ ప్రకాష్ బన్సాల్
జమ్మూ సెంట్రల్ యూనివర్శిటీ – సంజీవ్ జైన్
జార్ఖండ్ సెంట్రల్ యూనివర్శిటీ – క్షితి భూషణ్ దాస్
తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ – ముత్తుకలింగన్ కృష్ణన్
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్ – కామేశ్వర్ నాథ్ సింగ్
నార్త్-ఈస్ట్రన్ హిల్ యూనివర్సిటీ – ప్రభా శంకర్ శుక్లా
గురు ఘాసిదాస్ – అలోక్ కుమార్ చక్రవాల్
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) – సయ్యద్ ఐనుల్ హసన్
మణిపూర్ విశ్వవిద్యాలయం – ఎన్. లోకేందర్ సింగ్