మహేశ్వరం, ఏప్రిల్2: అన్నదాతకు అండగా ప్ర భుత్వం తీసుకొచ్చిన రైతుబీమా రైతుల కుటుంబాల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమాలు అన్నదాత కుటుంబాలకు కొండంత భరోసాను కల్పిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు రైతుబీమా దక్కుతుండడంతో రైతులు సం తోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలుస్తున్నారని రైతులు అంటున్నారు. ఎక్కడైతే రైతు మృతి చెందుతాడో అక్కడ వారం లోపలే రైతుబంధును వ్యవసాయాధికారులు రైతులకు అందజేస్తున్నామని అధికారులు అంటున్నారు. మండల వ్యా ప్తంగా ఇప్పటి వరకు 92 మందికి రైతుబీమాను అందజేసినట్లు వ్యవసాయాధికారులు అంటున్నారు. రైతు మృతిచెందిన వారంలోపే నామిని కుటుంబాలకు వారి అకౌంట్లలో జమచేస్తున్నట్లు తెలుపుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులకు ప్రభుత్వం ట్యాబ్లు అందజేస్తుండడంతో రైతుబీమా ప్రక్రియ వేగంగా కొనసాగుతుందని ప్రజలు అంటున్నారు. రైతు చనిపోయిన వెంటనే గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించి ట్యాబ్లో అప్లోడ్ చేసి జిల్లా వ్యవసాయాధికారికి పంపిన కొద్ది సేపటికే రైతు కుటుంబాల అకౌంట్లలో జమ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు 92 మంది రైతులకు రూ.4 కోట్ల 60 లక్షలు రైతుల అకౌంట్లో జమ చేసినట్లు చెబుతున్నారు. అన్ని వర్గాల రైతులకు రైతుబంధు, రైతుబీమా దక్కుతుండడంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.