నాలుగెకరాలు అందించిన ఎమ్మెల్సీ పురాణం
కోటపల్లి, ఏప్రిల్ 30 : పేదల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ నాలుగెకరాల భూమిని విరాళమిచ్చారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి 100 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. అనువైన స్థలం లేక నిర్మాణంలో జాప్యమైంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ కోటపల్లి మోడల్ స్కూల్ సమీపంలో తనుగుల రాజలింగు అనే వ్యక్తి వద్ద నాలుగెకరాల భూమిని రూ.6 లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించారు. ఇందుకు సంబంధించిన నగదును శుక్రవారం భూయజమానికి ఎంపీపీ మంత్రి సురేఖ, సర్పంచ్ రాగం రాజక్క చేతుల మీదుగా అందజేశారు.
సొంత ఊరి కోసం : పురాణం
పుట్టిన ఊరి రుణం తీర్చుకునేందుకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ప్రభుత్వానికి అప్పగించాను. కోటపల్లిలో నిర్మాణం చేపట్టిన నాలుగు లైన్ల రోడ్లో ఇండ్లు కోల్పోయిన బాధితులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మిస్తున్నాం. త్వరలోనే ఇండ్ల నిర్మాణాలను ప్రారంభిస్తాం.