నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో 2021-22 విద్యాసంవత్సరానికిగాను మొదటి దశ కౌన్సెలింగ్లో 172 మంది విద్యార్థులు గైర్హాజరైయ్యారు. వారి స్థానంలో మెరిట్ ఆధారంగా 172 సీట్లను భర్తీ చేస్తూ అధికారులు రెండో జాబితాను విడుదల చేశారు. వీరికి ఈ నెల 17న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
వీరితో పాటుగా పీహెచ్, క్యాప్, ఎన్సీసీ కేటగిరీ వారికి కూడా అదేరోజున కౌన్సెలింగ్ ఉంటుంది. గ్లోబల్ కేటగిరీలో ఎంపికైన విద్యార్థులకు 18న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జాబితాను www.admissions.rgukt.ac.in లో పొందుపరిచినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
పరువు నష్టం కేసులో నటి కంగనాకు చుక్కెదురు
Nizamabad : పైకి తేలిన అంతరాష్ట్ర రహదారి
నేషనల్ హైవేపై దిగిన సుఖోయ్, జాగ్వార్ యుద్ధ విమానాలు.. వీడియో