హుజూరాబాద్ మండలం చెల్పూర్లో ఏకగ్రీవ తీర్మానం
హుజూరాబాద్, సెప్టెంబర్ 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల చెల్పూర్ గ్రామ నాయీ బ్రాహ్మణులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గులాబీ పార్టీకి మద్దతుగా మంగళవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ పత్రాన్ని ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు గోగికార్ సుధాకర్, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకిషన్కు అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్, బాలకిషన్ మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ను అందిస్తున్నదని తెలిపారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనం కోసం సీఎం కేసీఆర్ రెండెకరాల భూమి, రూ.2 కోట్ల నిధులు కేటాయించారని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని నాయీ బ్రాహ్మణుల తరఫున వారు స్పష్టం చేశారు.