క్షమాపణ చెప్పకుంటే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
జాతీయ బీసీ మహిళా సమాఖ్య చైర్పర్సన్ భాగ్యలక్ష్మి
హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ)/ ఖైరతాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ నోరు అదుపులో పెట్టుకోవాలని జాతీయ బీసీ మహిళా సమాఖ్య చైర్పర్సన్ ఎం భాగ్యలక్ష్మి హెచ్చరించారు. నాగర్కర్నూల్లో జరిగిన బీజేపీ సభలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయ డం సిగ్గుచేటన్నారు. ఆదివారం ఆమె సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ రెండ్రోజుల క్రితం జడ్చర్లలో జరిగిన పార్టీ సమావేశంలో మమతలు, సమతలు అంటూ బండి సంజయ్ కుసంస్కారంగా మాట్లాడటం విచారకరమని అన్నారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు తెలంగాణ ఆడపడుచులంటే చులకనగా కనిపిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ రెండ్రోజుల్లో క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.