హైదరాబాద్, జూలై 23 (నమస్తే తెలంగాణ): ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా బండా శ్రీనివాస్ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నియమించారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు. బండారు శ్రీనివాస్ ఈ పదవిలో ఏడాదిపాటు కొనసాగనున్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని జీవోలో పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్వాసి, ఎస్సీ (మాదిగ) సామాజికవర్గానికి చెందిన బండా శ్రీనివాస్.. విద్యార్థి దశనుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో పలు హోదాల్లో పనిచేసి ఆ పార్టీ విద్యార్థి విభాగం కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా కొనసాగారు. హాకీ ప్లేయర్గా రాణించిన శ్రీనివాస్, హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడిగా, ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ వ్యవసాయ మారెట్ కమిటీ డైరెక్టర్, జిల్లా టెలికాం బోర్డు మెంబర్గానూ బండా శ్రీనివాస్ పనిచేశారు. హుజూరాబాద్ టౌన్ నుంచి ఎంపీటీసీగా రెండుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్లో 2001లోనే చేరారు. ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ హుజూరాబాద్ మండలాధ్యక్షుడిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పలు హోదాల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపునకు స్పందించి పార్టీ, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.