హైదరాబాద్ : ముస్లిం సోదర, సోదరీమణులకు రేపు బక్రీద్ పర్వదినం సందర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అని తెలిపారు. ప్రజలందరూ ఈ పండుగను ప్రశాంత వాతావరణంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కాగా, కొవిడ్ కారణంగా ఈ ఏడాది ఇండ్లలోనే పండుగను నిరాడంబరంగా జరుపుకోవాలని స్పీకర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
72 టీఎంసీలకు చేరిన శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్
కరోనాతో చనిపోయింది 4 లక్షలు కాదు.. 40 లక్షల మంది!
భారీగా పతనమైన అదానీ షేర్స్…కారణం ఇదే..!
రాగల మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన