హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ (ఈవోయూ), స్పెషల్ ఎకనమిక్ జోన్ (ఎస్ఈజెడ్)లకు సంబంధించిన ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్కు వైస్ చైర్మన్గా ఫోనిక్స్ గ్రూపు వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీకాంత్ బాడిగ ఎన్నికయ్యారు. శ్రీకాంత్ ఈ పోస్టుకు ఎన్నికైన మొదటి దక్షిణ భారత వ్యక్తి కావడం విశేషం. ఇంతకాలం వైస్ చైర్మన్గా ఉన్న భువనేశ్ సేత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. ఐటీ, ఐటీఈఎస్ సెజ్ల ఎగుమతుల్లో హైదరాబాద్ ఇప్పటికే ప్రముఖ స్థానంలో ఉన్నందున ఫ్రీ ట్రేడ్ జోన్లు, డ్రైపోర్టులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా శ్రీకాంత్ పేర్కొన్నారు. ఎగుమతులను పెంచేందుకు అవసరమైన సేవలు అందించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసిన సంస్థే ఈపీసీఈఎస్. ప్రస్తుతం ఇందులో 378 సెజ్లు సభ్యత్వం కలిగి ఉన్నాయి.