వాషింగ్టన్ : భారత్లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నియమించే అవకాశాలు ఉన్నాయి. ఈయన నియామకం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆసక్తితో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈయన నియామకానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశంలో తమ దేశ తాత్కాలిక రాయబారిగా డేనియల్ స్మిత్ను నియమించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయించారు. ఇటీవలే కేర్ టేకర్ విదేశాంగ మంత్రిగా, కేర్ టేకర్ డిప్యూటీ విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డేనియల్ స్మిత్ ను భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి తాత్కాలిక చీఫ్గా నియమించినట్లు సమాచారం. పూర్తికాలం రాయబారిని నియమించే వరకు డేనియల్ స్మిత్ బాధ్యతుల చూసుకుంటారని తెలుస్తున్నది.
భారతదేశంలో అమెరికా రాయబారి పదవి జనవరి 20 నుంచి ఖాళీగా ఉన్నది. ఈ పదవిలో నియామకానికి సెనేట్ నిర్ధారణ అవసరం.ఎవరినైనా నామినేట్ చేయాలనుకుంటే ధ్రువీకరణ ప్రక్రియ పూర్తిచేయడానికి చాలా సమయం పడుతుంది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో తమ రాయబార కార్యాలయ చీఫ్ పదవిని ఖాళీగా ఉంచలేకపోతున్నారు.
హర్యానాలో ప్రభుత్వ ఆజమాయిషీలో ప్రైవేట్ దవాఖానలు
ఓటమితో మమతకు సీఎంగా నైతిక హక్కు లేదు : త్రిపుర సీఎం బిప్లబ్
యాహూతో గూగుల్ను సవాల్ చేయాలని మైక్రోసాఫ్ట్ ప్లాన్..?!
ఫుట్పాత్పై రసరమ్య సంగీత బాణీలు.. చరిత్రలో ఈరోజు
పడిపోయిన ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ
ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు.. ఇవే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..