వెంగళరావునగర్, మే 21: బ్లాక్ ఫంగస్ను ఆయుర్వేద మందులతో పూర్తిగా నయం చేయవచ్చని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాల ప్రాంగణంలో శుక్రవారం బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు. ఈఎన్టీ, గాంధీ దవాఖానల్లో కూడా ఆయుర్వేద మందులను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్బాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఉమా శ్రీనివాస్, డాక్టర్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.