హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన ‘వీధి అరుగు’ ఆధ్వర్యంలో ‘భారతీయ వైద్య రంగం – శాంత ప్రస్థానంలో నా అనుభవాలు’, ‘ఆధునిక జీవనం – ఆయుర్వేద పాత్ర’పై కార్యక్రమం నిర్వహించనున్నారు. భారతీయ వైద్య రంగం – శాంత ప్రస్థానంలో నా అనుభవాలు అనే కార్యక్రమంలో శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. ఆధునిక జీవనం – ఆయుర్వేద పాత్ర అనే కార్యక్రమంలో కళారత్న, ఆంధ్రప్రదేశ్ హంస పురస్కార గ్రహీత, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జీవీ పూర్ణచంద్ పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా స్వదేశీ పరిజ్ఞానముతో భారతదేశంలో బయోఫార్మారంగం ఎలా అభివృద్ధి చెందింది? ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, టెక్నోక్రాట్లు ఎలాంటి విధానాలతో ముందుకు వెళ్ళాలి? ఆధునిక జీవితంలో మన ఆయుర్వేదం పాత్ర ఏమిటి? మానవుడు దైనందిక జీవితంలో ఎటువంటి కట్టుబాట్లు, నియమాలను పాటించాలి? కరోనా నివారణకు ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవచ్చు అని వేదిక నిర్వహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే, కాగా దీనికి సంబంధించిన కరపత్రాలను నిర్వహకులు విడుదల చేశారు. నాలుగు తెలుగు మాటలు చెప్పుకునేందుకు ‘వీధి అరుగు’ వేదికగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం నెదర్లాండ్స్లో నివసిస్తున్న గాయకుడు కార్తీక్ మద్దెల పాటతో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు మరియు మీ ప్రశ్నలను ఈ క్రింద లింక్ ద్వారా
అడగొచ్చు. https://tinyurl.com/VeedhiArugu