సంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లాలో విజయవంతమైంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదయ్యాయి. ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం, నియోజకవర్గ ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషితో జిల్లాలో 2.60 లక్షల మంది క్రియాశీలక, సాధారణ సభ్యత్వాలు స్వీకరించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులైన యువకులు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపారు. ‘ప్రతిపక్షాలు మోసపూరిత ప్రకటనలు, కల్లబొల్లిమాటలతో యువతను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేసినా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో యువతీ, యువకులు సభ్యత్వం స్వీకరించారు. సభ్యత్వ నమోదు పూర్తి కావటంతో ప్రస్తుతం ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయనున్నారు. జిల్లాలో 2.60 లక్షల సభ్యత్వ నమోదు కాగా, 86,250 మంది క్రియాశీలక సభ్యత్వాలు, 1,73,750 సాధారణ సభ్యత్వాలు నమోదయ్యాయి.
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పార్టీలో నూతనోత్సాహం నెలకొన్నది. నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువ సభ్యత్వాలు చేయడంతో పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపారు. క్రియాశీల, సాధారణ సభ్యత్వాల్లో యువత ఎక్కువగా ఆసక్తి చూపింది. మంత్రి హరీశ్రావు దిశానిర్దేశంతో సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బక్కి వెంకటయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు విజయవంతం అయింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో లక్ష్యానికి మించిన సభ్యత్వాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 2.60 లక్షల సభ్యత్వాలు నమోదు కాగా, అందులో 1.20 లక్షల మంది యువకులు ఉన్నారు. ప్రస్తుతం సభ్యత్వ వివరాలను ఆన్లైన్ చేస్తున్నారు.